ఇవాళ్టి నుంచి BJP నా భూమి, నా దేశం కార్యక్రమం

-

ఇవాళ్టి నుంచి BJP నా భూమి, నా దేశం కార్యక్రమం జరుగనుంది. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ… రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహించాలని బిజెపి నిర్ణయించింది. దీనిలో భాగంగా నేటి నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు ‘నా భూమి-నా దేశం’ కార్యక్రమం చేపట్టనుంది.

పార్టీ శ్రేణులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని వచ్చే ఎన్నికల్లో బిజెపి విజయానికి కృషి చేయాలని రాష్ట్ర బిజెపి చీఫ్ పురందేశ్వరి పిలుపునిచ్చారు. కాగా, సజ్జలపై ఏపీ బీజేపీ చీఫ్‌ పురంధేశ్వరి సీరియస్‌ అయ్యారు. మా కుటుంబం కలిస్తే తప్పేంటి ? అంటూ నిలదీశారు. బీజేపీ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర కార్యాలయంలో శంఖ నాధం సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు హాజరైన పురంధేశ్వరి మీడియాతో మాట్లాడారు. ఎన్నికలకి శంఖనాధం పూరిస్తున్నామని.. మరి కొన్ని నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news