చంద్ర బాబు అరెస్ట్ తట్టుకోలేక 25 మంది మృతి : లోకేష్

-

టీడీపీ కార్యకర్తలు, అభిమానులు అధైర్యపడవద్దని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సూచించారు. అంతిమంగా సత్యమే గెలుస్తుందని భరోసా ఇచ్చారు. చంద్రబాబు అరెస్టుపై ప్రజలు వర్గాలకు, ప్రాంతాలకు అతీతంగా తీవ్ర ఆవేదనకు గురవుతున్నారని చెప్పారు. చంద్రబాబు అరెస్టు, రిమాండ్ పరిణామాలు చూసి వారు తట్టుకోలేకపోతున్నారని వివరించారు. ఇప్పటి వరకు 25 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరం అని తెలిపారు.

టీడీపీ అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు అధైర్యం వద్దని, కచ్చితంగా సత్యమే గెలిచి తీరుతుందని నారా లోకేశ్ అన్నారు. చంద్రబాబు అరెస్టు జగన్ కక్షపూరిత చర్య అనేది దేశమంతటా గుర్తించిందని వివరించారు. అరెస్టు పై న్యాయపోరాటం చేస్తామని చెప్పారు. చంద్రబాబుపై ఆధారాలు లేకున్నా కేసు పెట్టారని, వారి డ్రామాకు త్వరలోనే తెర పడుతుందని అన్నారు. కాబట్టి, ఎవరూ భావోద్వేగాలకు గురి కావొద్దని, అందరూ క్షేమంగా ఉండాలని పిలుపు ఇచ్చారు. చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ నిరసన చేసినందుకు హత్యాయత్నం కేసులు పెడతారా? నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి వేధిస్తారా? అంటూ జగన్ ప్రభుత్వంపై నారా లోకేశ్ నిప్పులు కురిపించారు.

Read more RELATED
Recommended to you

Latest news