బీఆర్ఎస్, ఎంఐఎం దొంగ ఓట్లు సృష్టిస్తున్నాయి.. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

-

తెలంగాణలో ఎన్నికల హడావిడి అప్పుడే మొదలైంది. పలు రాజకీయ పార్టీల నాయకులు ఒకరిపై మరొకరు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి దొంగ ఓట్లకు తెర తీశారని ఆరోపించారు. తెలంగాణలో బోగస్ ఓట్లు సృష్టిస్తున్నారని అన్నారు. ఇతర రాష్ట్ర వ్యక్తులతో తెలంగాణలో ఓట్లు సృష్టిస్తున్నారని అన్నారు. ఒక్కో నియోజకవర్గంలో 70 వేల దొంగ ఓట్లకు కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని అన్నారు.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎక్కువగా దొంగఓట్లు పెరుగుతున్నాయని రాజాసింగ్ ఆరోపించారు. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోని గోశామహల్ సెగ్మెంట్ లో ఓట్లు తగ్గుతున్నాయని చెప్పారు. మిగతా సెగ్మెంట్లలో ఓట్లు పెరుగుతున్నాయని అన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక వ్యక్తుల ఓట్లు తెలంగాణలో నమోదై ఉన్నాయని రాజాసింగ్ ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలనే ఓట్లను తొలగిస్తుందని పేర్కొన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్.

Read more RELATED
Recommended to you

Latest news