బాలకృష్ణ ఇద్దరిని పిట్టల్ని కాల్చినట్టు కాల్చేశాడు – పోసాని కృష్ణమురళి

-

చంద్రబాబు అవినీతిని సీనియర్ ఎన్టీఆర్ అప్పుడే బయటపెట్టారని ఏపీ ఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. పురంధేశ్వరీ బీజేపీ అధ్యక్షురాలు కాగానే సీఎం జగన్ ని, వైఎస్సార్ ని తిట్టడం మొదలు పెట్టింది. చంద్రబాబు దగ్గరి బంధువు కాబట్టి.. అరెస్ట్ గురించి మాట్లాడుతుంది. చంద్రబాబు ఎంత దుర్మార్గుడో అంటూ కొన్ని వీడియోలను చూపించారు పోసాని.

అదేవిధంగా బాలకృష్ణకి సంబంధించిన కేసు గురించి కూడా వివరించారు పోసాని. బాలకృష్ణ తన రివాల్వర్ తో ఇద్దరిని కాల్చాడు.. బాలకృష్ణ బయపడి పురంధరేశ్వరి దగ్గరికి ఏడుస్తూ వచ్చాడు. పురంధరేశ్వరి, వెంకటేశ్వర్ రావు ఇద్దరు వైఎస్ దగ్గరికి వచ్చారు. మా తమ్ముడు ఇద్దరిని కాల్చాడు అన్నయ్య అని వైఎస్ కాళ్ల మీద పడింది.బాలకృష్ణని సెల్ లో పెట్టకుండా వైఎస్ కాపాడారు. ఓ ఆడపిల్ల తన దగ్గర ఏడ్చింది కాబట్టి. క్రిమినల్స్ ని కాపాడటం మీ మెంటాలిటీనా. ఎన్ని సార్లు, ఎన్ని పార్టీలు మారుతారు మేడం. మీ నాన్న మద్యపానం నిషేధిస్తే… బాబు మళ్ళీ మద్యం ఏరులై పారించాడు. రామారావు గారిని వెన్నుపోటు పొడిచి చంపేశారు. మీ ఆయనకు డిప్యూటీ సీఎం పదవీ ఇస్తానని ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ లో చేరారని గుర్తు చేశారు పోసాని.

Read more RELATED
Recommended to you

Latest news