తెలంగాణలో విషాదం.. గుండెపోటుతో ఇంటర్ అమ్మాయి మృతి

-

గుండె పోటు.. ఇటీవల పిల్లల నుంచి పండు ముసలి వాళ్ల వరకు చాలా మంది దీనికి బలైపోతున్నారు. అప్పటిదాకా ఎంతో ఉత్సాహంగా ఉన్న వాళ్లు కూడా అకస్మాత్తుగా కుప్పకూలి ప్రాణాలు వదులు తున్నారు. ముఖ్యంగా టీనేజ్ పిల్లలు, యువత లో గుండెపోటు ఎక్కువగా వస్తోంది. తాజాగా శ్రీ భద్రాద్రి జిల్లా పాల్వంచ లో విషాదం చోటు చేసుకుంది.

Inter girl dies of heart attack
Inter girl dies of heart attack

భద్రాద్రి జిల్లా పాల్వంచకు చెందిన ఇంటర్ విద్యార్థిని పల్లవి (16) గుండెపోటు తో మరణించింది. ఖమ్మంలోని SR కాలేజీలో ఫస్ట్ఇయర్ చదువుతున్న పల్లవి నిన్న స్పెషల్ క్లాస్ లకు అటెండ్ అయింది. కొద్దిసేపటికి అస్వస్థతకు గురై కింద పడిపోవడంతో ఆస్పత్రికి తరలించారు. పల్లవి కార్డియాక్ అరెస్టు వల్ల అప్పటికే మరణించిందని డాక్టర్లు తెలిపారు. పల్లవి మృతికి కాలేజీ యాజమాన్యమే బాధ్యత తీసుకోవాలని పేరెంట్స్ ఆందోళనకు దిగారు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news