మెక్సికోలో ఘోర బస్సు ప్రమాదం.. 16 మంది మృతి

-

మెక్సికోలో గత పదిహేను రోజుల వ్యవధిలో జరిగిన రెండు ఘోర ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఇటీవల గ్వాటెమాలా సరిహద్దు సమీపంలో చియాపాస్‌లోని హైవేపై వలసదారులు ప్రయాణిస్తున్న సరుకు రవాణా ట్రక్ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 10 మంది క్యూబా వలసదారులు మరణించారు. ఈ ప్రమాదం మరవకముందే తాజాగా మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

దక్షిణ మెక్సికోలో శుక్రవారం రోజున ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 16 మంది దుర్మరణం చెందారు. మరో 29 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. మృతులంతా వెనిజులా, హైతీకి చెందిన వలసదారులుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో తొలుత 18 మంది మరణించారని అధికారులు భావించగా.. ఆ తర్వాత 16 మంది మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వెనిజులా నుంచి వచ్చిన మొత్తం 55 మంది వలసదారులు వాహనంలో ఉన్నారని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news