బీజేపీకి నష్ట పరిచేందుకు ఆ ముగ్గురు కుట్ర చేస్తున్నారు : ఎంపీ అరవింద్

-

బీజేపీ పార్టీని నష్ట పరిచేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత కుట్ర చేస్తున్నారని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం నాడు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బీజేపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ ఎంపీ అర్వింద్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా అర్వింద్ మీడియాతో మాట్లాడుతూ..‘‘మున్నూరు కాపులు, మైనార్టీలు ఆకుల లలితను నమ్మొద్దు. గతంలోనూ ఆకుల లలిత, డీఎస్‌ను మోసం చేసి ఎమ్మెల్సీ పదవి తెచ్చుకుంది. ప్రస్తుతం డీఎస్ కొడుకు సంజయ్‌ను మోసం చేయాలని చూస్తోంది. ఎమ్మెల్సీ కవిత, రేవంత్‌రెడ్డి వ్యాపార భాగస్వామిలు. ఆకుల లలితను కవిత కావాలని కాంగ్రెస్ పార్టీలోకి పంపి టికెట్ ఇప్పిస్తున్నారు’’ అని ఎంపీ అరవింద్ ధ్వజమెత్తారు.

 

Read more RELATED
Recommended to you

Latest news