కోర్టులకు చంద్రబాబు తలనొప్పిలా మారాడు – విజయసాయి

-

న్యాయం, ధర్మం, నిజాయితీ అంటే అర్థం ఏమిటి పురందేశ్వరి గారు? అంటూ వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయాన్ని ఓడించడానికి ఓ పక్క కోట్లు వెదజల్లుతూ, పేరుమోసిన లాయర్లతో పిటిషన్ల మీద పిటిషన్లు వేయిస్తూ మరోపక్క న్యాయం గెలవాలని ఆందోళన చేయడం వింతే కదా? అంటూ సెటైర్లు పేల్చారు సాయిరెడ్డి. మీ దృష్టిలో న్యాయం, ధర్మం, నిజాయితీ అంటే అర్థం ఏమిటి పురందేశ్వరి గారు?

వేల కోట్ల స్కాములకు పాల్పడిన చంద్రబాబు గారిపై కేసులు పెట్టడం అన్యాయమా? అని నిలదీశారు. ట్రయల్ కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు 50కు పైగా పిటిషన్లు వేశారు చంద్రబాబు గారి ప్లీడర్లు… వాటిని కొట్టేసినా, వాయిదా వేసినా మరికొన్ని పిటిషన్లు పడుతున్నాయని ఎద్దేవా చేశారు. ఏ కోర్టును ఏం అభ్యర్థిస్తున్నారో వాళ్ళకే తెలియనంత గందరగోళం అంటూ సెటైర్లు పేల్చారు సాయిరెడ్డి. పెండింగ్ కేసుల భారంతో ఒత్తిడిలో ఉన్న కోర్టులకు చంద్రబాబు తలనొప్పిలా మారాడు. న్యాయ వ్యవస్థ ఇదంతా గమనిస్తూనే ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news