రెండు శాతం ఓట్లు వచ్చే బీజేపీ.. బీసీనీ సీఎం చేస్తుందా ? : రాహుల్ గాంధీ

-

ప్రత్యేక తెలంగాణ కోసం ప్రజలు కలలు కన్నారని.. తెలంగాణ ఏర్పాటైన తరువాత ఒకే కుటుంబానికి మేలు జరిగిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఇవాళ కల్వకుర్తి లో జరిగిన కాంగ్రెస్ విజయభేరీ సభకు ఆయన హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణలో ఉద్యోగాలు, పదవులు అన్నీ ఒకే కుటుంబానికి దక్కాయని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ కుటుంబం లక్ష కోట్లు దోచుకుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ప్రాజెక్టులు నిర్మించామని గుర్తు చేశారు. ప్రాజెక్టుల ద్వారా నిర్వాసుతులైన ప్రజలకు ఇండ్లు, భూములు ఇచ్చామన్నారు.

తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకొచ్చి పేదల భూములను లాక్కున్నారని పేర్కొన్నారు. ధరణి ద్వారా దాదాపు 20 లక్షల మంది రైతుల భూములు లాక్కున్నారని తెలిపారు రాహుల్ గాంధీ. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన భూములను కూడా లాక్కున్నారని మండిపడ్డారు. మరోవైపు బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తానని బీజేపీ చెబుతోంది. రెండు శాతం ఓట్లు వచ్చే బీజేపీ బీసీని ముఖ్యమంత్రి ఎలా చేస్తుందని ప్రశ్నించారు రాహుల్ గాంధీ. బీజేపీ మాటలు చాలా హాస్యస్పదంగా ఉన్నాయన్నారు. రాష్ట్రం కోసం, కుటుంబం కోసం కష్టపడే మహిళలకు న్యాయం జరగాలని.. అందుకే ప్రతినెల రూ.2500 మహిళల ఖాతాల్లో వేస్తామని తెలిపారు రాహుల్ గాంధీ.

Read more RELATED
Recommended to you

Latest news