టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న శ్రీలంక

-

ప్రస్తుతం వన్డే వరల్డ్ కప్ జోరు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ వరల్డ్ కప్ లో దక్షిణాఫ్రికా మొదటి స్థానంలో కొనసాగుతుండగా.. టీమిండియా రెండో స్థానంలో కొనసాగుతున్నాయి. ఇవాళ జరుగనున్న వరల్డ్ కప్ మ్యాచ్ లో భాగంగా భారత జట్టుతో జరిగే మ్యాచ్ లో ఇవాళ శ్రీలంక జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే టీమిండియా వరుస విజయాలతో దూసుకెళ్తుంది. మరోవైపు శ్రీలంక జట్టు ఈ మ్యాచ్ లో ఓడిపోతే సెమీస్ అవకాశాలు కోల్పోయినట్టే.. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో శ్రీలంక జట్టు గెలుస్తుందో.. లేక టీమిండియా జోరు కొనసాగుతుందో మరికొద్దిసేపట్లోనే తెలియనుంది. కాసేపట్లోనే ముంబై వేదికగా భారత్-శ్రీలంక మధ్య మ్యాచ్ జరుగనుంది.

భారత జట్టు : రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కే.ఎల్.రాహుల్, సూర్యకుమార్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్.

శ్రీలంక జట్టు : నిస్సాంక, కరుణరత్నే, మెండిస్, సమరవిక్రమ, చరిత్ అసలంక, మాథ్యూస్, దుషన్ హేమంత, తీక్షణ, రజిత, దుష్మంత చమీర, దిల్షన్ మధుశంక

Read more RELATED
Recommended to you

Latest news