BRS పోయి.. కాంగ్రెస్ వస్తే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టే – కిషన్ రెడ్డి

-

BRS పోయి.. కాంగ్రెస్ వస్తే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టేనని విమర్శలు చేశారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఈ రోజు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయింది. అక్కడఎన్నికలు జరిగితే భారీ మెజారిటీతో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈ దేశంలో కాని, ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ అన్ని సమస్యలకు మూలకారణం కాంగ్రెస్ పార్టీ అన్నారు.

సీఎం కేసీఆర్ నియంతల పాలన చేస్తున్నారని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మండిపడ్డారు. మీడియాతో మాట్లాడుతూ….. ‘ఉద్యమాల పేరుతో అధికారంలోకి వచ్చిన ఆయన…. నేడు ప్రజా ఆందోళనలను అణచివేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా చేశారు. ఏ లక్ష్యం కోసమైతే తెలంగాణ సాధించుకున్నామో దానికి విరుద్ధంగా పాలన ఉంది. సీఎం, మంత్రులను సామాన్య ప్రజలు కలిసే పరిస్థితి లేదు’ అని విమర్శించారు. తెలంగాణలో వచ్చే ప్రభుత్వం బీజేపీ పార్టీదేనన్నారు బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news