నేడు 4 నియోజక వర్గాల్లో సీఎం కేసీఆర్ ప్రచారం

-

నేడు 4 నియోజక వర్గాల్లో సీఎం కేసీఆర్ ప్రచారం చేయనున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఇవాళ పర్యటిస్తారు సీఎం కేసీఆర్‌. నేడు దేవరకద్ర, గద్వాల, మక్తల్, నారాయణ పేట లలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించనున్నారు. ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్న సీఎం కేసీఆర్..ప్రతిపక్షాలపై మాటల దాడి చేయనున్నారు.

ఈ సంధర్భంగా నేడు కొత్తగూడెంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇది ఇలా ఉండగా…తాజాగా కేసీఆర్ నియోజకవర్గాల రెండో షెడ్యూల్ ఖరారైంది. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గాల పర్యటన రెండో షెడ్యూల్ ఖరారైంది. నిన్నటి నుంచి 8 వ తేదీ వరకు మరో 11 నియోజక వర్గాల్లో సీఎం పర్యటన చేపట్టనున్నారు. నవంబర్ 28 న గజ్వేల్ నియోజకవర్గంలో జరిగే ప్రజా ఆశీర్వాద సభతో కేసీఅర్ ఎన్నికల ప్రచారం పూర్తి అవుతుంది. అంటే 96 నియోజకవర్గాలలో సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం కొనసాగనుందన్న మాట.

Read more RELATED
Recommended to you

Latest news