టీడీపీ హయాంలో అన్నీ స్కాములే … స్కీముల్లేవు: సీఎం జగన్

-

ఈ రోజు ఉదయం నుండి ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి పర్యటిస్తున్నారు. అందులో భాగంగా ఇక్కడ జరిగిన బహిరంగ సభలో వైఎస్సార్ రైతు భరోసా నిధులను లబ్దిదారుల ఖాతాలలోకి జమచేశారు. ఈ సందర్భంగా జగన్ ప్రతిపక్ష పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు, టీడీపీ హయాంలో చేసిన స్కీం లు ఏమైనా ఉంటే కదా వారు చెప్పుకోవడానికి ? మద్యం, ఇసుక మరియు రాజధాని ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ స్కామ్ లో అంటూ విరుచుకుపడ్డారు. ఈసారి జరగనున్న ఎన్నికల్లో గెలవడానికి ఒకవైపు చంద్రబాబు, గజదొంగలా ముఠా, దత్తపుత్రుడు ఎంతగానో ఎదురుచూస్తున్నారు, అవసరం అయితే ఎటువంటుకి హామీలను అయినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అంటూ జగన్ ఫైర్ అయ్యారు. రేపు పొద్దున్న మీ ఇంటికి వచ్చి ఎన్నికల్లో మాకు ఓటు వేసి గెలిపిస్తే ప్రతి ఇంటికీ బెంజ్ కారు ఇస్తామని చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటూ సెటైర్ వేశారు జగన్.

మీకు మన ప్రభుత్వం ద్వారా మంచి జరిగిందని భావిస్తే ఓటు వేయండి.. అంతే కానీ చంద్రబాబు అండ్ టీం చెప్పే కాకమ్మ కబుర్లకు బోల్తాపడద్దు అంటూ చెప్పుకొచ్చాడు సీఎం జగన్.

Read more RELATED
Recommended to you

Latest news