ఇల్లు కట్టుకోవడానికి రూ. 5 లక్షలు ఇస్తాం: రేవంత్ రెడ్డి

-

తెలంగాణాలో నవంబర్ 30వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీల నేతలు తలమునకలై ఉన్నారు. ఈ ప్రచారంలో భాగంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గం లోని దౌలతాబాద్ లో ఈ రోజు పర్యటించారు. ఈ ప్రచార కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పది సంవత్సరాలుగా కనీసం ఒక్క హామీని కూడా నెరవేర్చని BRS పార్టీ ఇప్పుడు మళ్ళీ మమ్మల్ని గెలిపించండి అని ఎలా అడుగుతోందని ప్రశ్నించారు. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఎక్కడ ? దళితులకు 3 ఎకరాల భూమి ఎక్కడ అంటూ రేవంత్ రెడ్డి అధికార పార్టీని ప్రశ్నించారు. అందుకే మా కాంగ్ర్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించండి..

మీకు 500 కె గ్యాస్ సిలిండర్, రైతు భరోసా లో ప్రతి ఒక్క రైతుకు 15 వేలు, పెన్షన్ ఒక నెలకు 4 వేలు, ఇంకా అన్నిటికన్నా చాలా ముఖ్యమైన ఇంటిని నిర్మించుకోవడానికి రూ.5 లక్షలు ఇస్తామంటూ రేవంత్ రెడ్డి పేదలకు వరాల జల్లును ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news