తనకు కాబోయే వరుడిని పరిచయం చేసిన నాగచైతన్య హీరోయిన్

-

టాలీవుడ్ సీనియర్ నటి రాధ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది కార్తిక నాయర్. జోష్ సినిమాతో నాగచైతన్య సరసన టాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత దమ్ము, బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ, రంగం వంటి పలు సినిమాల్లో నటించింది. సినిమా బ్యాక్​గ్రౌండ్​తో ఎంట్రీ ఇచ్చినా.. ఈ భామకు అంతగా అవకాశాలు మాత్రం రాలేదు. ఆ తర్వాత తెలుగు తెరపై కనుమరుగైపోయింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్​గానే ఉంటుంది ఈ భామ.

ఇటీవలే ఈ బ్యూటీ తన నిశ్చితార్థం ఫొటోలు పోస్టు చేసి ఫ్యాన్స్​కు షాక్ ఇచ్చింది. తాజాగా తనకు కాబోయే భర్త రోహిత్‌ మేనన్‌ను పరిచయం చేస్తూ మరో పోస్టు పెట్టింది కార్తిక. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. జంట బాగుందంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఈ ఫొటోలు నెట్టింట పోస్టు చేసిన కార్తిక.. వాటి కింది.. ‘‘నిన్ను కలవడం అనేది విధి.. నిన్ను ఇష్టపడటం ఒక మ్యాజిక్‌.. మన జీవన ప్రయాణం మొదలుపెట్టడానికి కౌంట్‌డౌన్‌ ప్రారంభించా’’ అని క్యాప్షన్ రాసుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news