గుడ్ న్యూస్.. పండుగ అవ్వగానే రైతు బంధు డబ్బులు..!

-

ఖమ్మం జిల్లా కూసుమంచి కి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. ఆయన పొంగులేటి కార్యాలయం లో మాట్లాడడం జరిగింది. రైతు బంధుపై అపోహలు వద్దని పండగ అయిపోగానే రైతులకి గుడ్ న్యూస్ చెప్తామని తుమ్మల చెప్పారు. ఎంత అహంకారం వున్నా ప్రజల ముందు దిగదుపే అని తెలంగాణ ప్రజలు నిరూపించారని అన్నారు. తెలంగాణలో కబ్జాల రాజ్యం పోవాలని ప్రజలు కోరుకున్నారని అందుకే కాంగ్రెస్ ని గెలిపించాలని అన్నారు.

తమ ప్రభుత్వంలో నిజమైన అర్హుల కి పథకాలు అందిస్తే తమ లక్ష్యం నెరవేరుతుందని మంత్రు తుమ్మల చెప్పారు. సీఎం కేసీఆర్ మాటలకే పరిమితం అయ్యారని విమర్శించారు రేవంత్ ద్వారా ప్రజల వద్దకు పథకాలు వెళ్తున్నాయని అన్నారు. రేవంత్ రెడ్డి శ్రమ సక్సెస్ అవ్వాలని ఆయన కోరుతున్నట్లు చెప్పారు. ఖమ్మం జిల్లాకి ఈ ఏడాది నీరు ప్రవేశిస్తాయి అని అన్నారు పది లక్షల ఎకరాలకి సాగునీరు ఇవ్వడం కాంగ్రెస్ లక్ష్యమని అన్నారు

Read more RELATED
Recommended to you

Latest news