అన్నదాతలకు గుడ్ న్యూస్.. అకౌంట్ లో డబ్బులు జమ..!

-

అన్నదాతలకి గుడ్ న్యూస్. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు రైతుల అకౌంట్లో నేరుగా రైతు బంధు పైసలు విడుదల చేసింది. ఇవాళ మధ్యాహ్నం నుండే రైతులు అకౌంట్లో నేరుగా డబ్బులు పడుతున్నాయి. దీంతో రైతులు ఆనందాన్ని వ్యక్త పరుస్తున్నారు. కాగా రెండు ఎకరాలు ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు పడినట్లు తెలుస్తోంది.

గత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పాత పథకం ప్రకారమే డబ్బులు అందినట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరులోగా రాష్ట్ర రైతుల ఖాతాల్లోకి రైతు బంధు నగదు జమ అవుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఇంకో వైపు రెండు లక్షల రైతుల రుణ మాఫీని దశల వారీగా రైతుల అకౌంట్లోకి జమ చేయడానికి ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు

Read more RELATED
Recommended to you

Latest news