ఆ షో వేసి తప్పు చేశాను: నాగ వంశీ

-

సంక్రాంతి కానుకగా మహేష్ బాబు గుంటూరు కారం సినిమా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో గుంటూరు కారం సినిమా వచ్చింది మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే ఓ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేశారు ప్రేక్షకులంతా. ఆ అంచనాలని మరింత పెంచుతూ ప్రొడ్యూసర్ నాగ వంశీ తన మాటలతోనే హైప్ క్రియేట్ చేసారు. సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేసి జనవరి 12న రిలీజ్ అయిన గుంటూరు కారం సినిమా డివైడెడ్ టాక్ ని సొంతం చేసుకుంది క్రిటిక్స్ నుండి కూడా గుంటూరు కారం సినిమాకి యావరేజ్ రివ్యూస్ వచ్చాయి.

క్రిటిక్స్ ఓపెనింగ్స్ అండ్ రివ్యూస్ ని పక్కన పెడితే గుంటూరు కారం టాక్ కి భిన్నంగా కలెక్షన్లను రాబడుతుందని అన్నారు నాగ వంశీ మొదటి వారంలోనే 212 కోట్లని రాబట్టి 90% రికవర్ చేసింది అని చెప్పారు నాగ వంశీ. గుంటూరు కారం సినిమా సెకండ్ వీక్ లో ఎంటర్ అవుతున్న సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టి నెగటివ్ టాక్ రావడానికి కారణాలు చెప్పారు. సినిమా అర్ధరాత్రి ఒంటి గంటకి కొన్ని షోస్ పడ్డాయి అన్నారు ఆ షో వేయడం వలన ఇదంతా జరిగిందని నాగ వంశీ అన్నారు ఫ్యామిలీ సినిమా కాబట్టి అర్ధరాత్రి షో వేయకుండా ఉండాల్సింది అని అన్నారు

Read more RELATED
Recommended to you

Latest news