ఈ నెల 27 నుంచి అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశాలు

-

ఈ నెల 27 నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించాలని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఫిబ్రవరి 10వ తేదీ వరకు నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించనున్నారు.అసెంబ్లీ ఎన్నికల సమీక్షతో పాటు క్షేత్రస్థాయి అంశాలు, లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నట్లుతెలిపారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జీలు ఈ సమావేశాల నిర్వహణ బాధ్యత వహిస్తారు.

27న జూబ్లీహిల్స్‌, వనపర్తి,సిద్దిపేట, బోథ్‌, నల్గొండ.. 28న సిరిసిల్ల, ముషీరాబాద్‌, పాలకుర్తి,వర్ధన్నపేట, మెదక్‌ నియోజకవర్గాల సమావేశాలు జరుగనున్నాయి. 29న జుకల్‌, ఆందోల్‌, వికారాబాద్‌,ఆలేరు, నర్సంపేట, ఖైరతాబాద్‌, జగిత్యాల నియోజకవర్గ సమావేశాలు జరుగనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news