సోయం బాపురావు మరోసారి సంచలన వ్యాఖ్యలు

-

ఆదిలాబాద్ బిజెపి ఎంపీ సోయం బాపురావు తీరు వివాదాస్పదం అవుతోంది. కాజాగా ఎంపీ ల్యాబ్స్ నిధిలోను తన సొంతం చేసుకునేందుకు వాడుకున్నట్టు బహిరంగంగా చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు వస్తే టూరిస్టులు వచ్చినట్టు టికెట్ల కోసం వస్తున్నారని.. ఎంపీ ఏం చేయలేదని సొంత పార్టీలోని కొంతమంది నాయకులు ప్రచారం చేయడం వాళ్ల మూర్ఖత్వమే అన్నారు. విందులిచ్చి ఫ్లెక్సీలు పెట్టినంత మాత్రాన బిజెపి టికెట్ ఇచ్చే పరిస్థితి ఉండదని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే టిఆర్ఎస్ నుంచి వచ్చిన ఓ నాయకుడు నాకే టికెట్ అంటూ ప్రచారం చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అలాంటి వారికి కాదు పార్టీని నడిపించిన వారికే టికెట్ వస్తుందని క్లారిటీ ఇచ్చారు. అడిగిన వాళ్లందరికీ టికెట్ ఇస్తుందా అది ఏమైనా బస్సు టికెట్ నా రైలు టికెట్ అని సోయం బాపురావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం పనిచేసిన వారికే టికెట్ ఇస్తుందన్నారు. ఎమ్మెల్యే సపోర్టు ఉందని తనకు ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ ఉందని కొంతమంది అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దానిపై అధిష్టానం దృష్టి సారించింది అన్నారు. టికెట్ ఇస్తా అని లేదా ఇవ్వనని ఇప్పటివరకు పార్టీ చెప్పలేదన్నారు. పార్టీ కోసం పనిచేసిన తనకు టికెట్ వచ్చే అవకాశం ఉందన్నారు. తాను ఎంపీగా ఉండి పార్లమెంటు పరిధిలో నాలుగు అసెంబ్లీ స్థానాలు గెలిపించుకున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news