గ్రామీ విజేతలుగా శంకర్​ మహదేవన్​, జాకీర్ హుస్సేన్​

-

మ్యూజిక్ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పురస్కారం గ్రామీ. ఈ అవార్డుల ప్రదానోత్సవం ఇవాళ అట్టహాసంగా జరిగింది. అమెరికాలోని  లాస్‌ ఏంజిల్స్ దీనికి​ వేదిక అయింది. ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ప్రపంచ దేశాలకు చెందిన సంగీత కళాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు పాటలు పాడి అలరించారు.

అయితే ఈ అంతర్జాతీయ సంగీత వేదిక (గ్రామీ పురస్కారాలు)పై భారతీయ సంగీత విద్వాంసులు తమ సత్తా చాటారు. ఈ అవార్డుల కార్యక్రమంలో భారత్ కు ఓ పురస్కారం వరించింది. ఇండియన్ మ్యూజిక్ ఆర్టిస్ట్​లు శంకర్ మహదేవన్​, జాకీర్ హుస్సేన్​ కంపోజ్​ చేసిన ‘దిస్ మూమెంట్​’.. బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్​ ఆల్బమ్​గా అవార్డ్​ సొంతం చేసుకుంది. ఈ పాటను జాన్ మెక్​ లాగ్లిన్ (గిటార్​), జాకిర్ హుస్సేన్​ (తబ్లా), శంకర్​ మహదేవన్ ​(సింగర్​), వి సెల్వగనేశ్ ​(percussionist​), గనేశ్​ రాజాగోపాలన్ ​(violinist​) ఇలా మొత్తం 8 మంది కలిసి కంపోజ్ చేశారు. భారతీయ సంగీతం గొప్పదనాన్ని విశ్వ వేదికపై చాటిన వీరికి ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news