TTD : ఇక ఆన్‌లైన్‌లోనే వీఐపీ బ్రేక్‌ దర్శన టికెట్ల విక్రయాలు

-

తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలెర్ట్. వీఐపీ బ్రేక్‌ దర్శన టికెట్ల విక్రయాలపై కీలక ప్రకటన చేసింది టీటీడీ పాలక మండలి. తిరుమలలో ఇక ఆన్‌లైన్‌లోనే వీఐపీ బ్రేక్‌ దర్శన టికెట్ల విక్రయాలు జరుగుతాయని టీటీడీ పాలక మండలి పేర్కొంది. క్యూలైన్‌లో నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొనడంతో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది.

Tirumala VIP break darshan tickets are now sold online

ఇది ఇలా ఉండగా, తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. దింతో తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారిని 70,679 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారికి 21,717 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.. నిన్న ఒక్కరోజే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.36 కోట్లు గా నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news