CM JAGAN: జగన్ స్కెచ్..రాజ్యసభకు వైవీ సుబ్బారెడ్డి !

-

CM JAGAN: ఏపీలో రాజ్యసభ ఎన్నికల హీట్ నెలకొంది. ఇవాళ రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ తరుణంలోనే.. ఏపీలో మూడు రాజ్యసభ స్థానాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇక ఇవాళ్టి నుంచి ఈ నెల 15 వ తేదీ వరకు రాజ్యసభ నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది.

CM Jagan has finalized the Rajya Sabha candidates

ఈ తరుణంలోనే మూడు స్థానాలకు అభ్యర్థులను దాదాపు ఖరారు చేశారు సీఎం జగన్. వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడ రఘునాథ్‌ రెడ్డి పేర్లు ఖరారు అయినట్లు సమాచారం అందుతోంది. ఒకటి, రెండు రోజుల్లో అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news