కోహ్లి, రోహిత్ అత్యుత్తమ ఆటగాళ్లు అంటూ ప్రశంసల వర్షం కురిపించిన ఇంగ్లాండ్ క్రికెటర్…

-

టీమిండియా ప్లేయర్స్ పై ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ ప్రశంసల వర్షం కురిపించారు.ప్రస్తుత తరంలో టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి అత్యుత్తమ ఆటగాళ్లని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ ప్రశంసల వర్షం కురిపించాడు .’వీరిద్దరూ జట్టులో జూనియర్లకు ఆదర్శంగా నిలుస్తూ, ఒత్తిడి సమయాల్లో ఎలా ఆడాలో జూనియర్ ప్లేయర్స్ కి తగు సూచనలను ఇస్తున్నారని తెలిపారు. ఇక త్వరలో జరగబోయే టెస్ట్ మ్యాచ్లో వారు భారీ స్కోర్లు చేయకుండా మేం శాయశక్తులా కృషిచేస్తూనే ఉంటాం అని తెలిపారు. వీరిద్దరూ త్వరగా ఔటైతే మ్యాచ్ మా చేతుల్లోకి వచ్చినట్లేనని భావిస్తాం అని అన్నారు. ప్రస్తుతం టీమ్ ఇండియా టెస్టుల్లోనూ దూకుడుగా ఆడుతోంది’ అని ఆయన పేర్కొన్నారు.

ఇక ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇప్పటివరకు జరిగిన రెండు టెస్టులలో ఇరుజట్లు చెరొక విజయం సాధించడంతో సిరీస్ 1-1 తో సమం అయింది.ఇక మూడో టెస్ట్ భారత్ ,ఇంగ్లాండ్ మధ్య ఈనెల 15 నుంచి రాజ్‌కోట్‌ వేదికగా మొదలుకానున్న మూడవ టెస్టుకు కింగ్ విరాట్ కోహ్లీ దూరం అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news