వచ్చే ఎన్నికల్లో బీజేపీ అత్యధిక సీట్లు గెలుస్తుంది : ప్రధాని మోడీ

-

సబ్ కా సాత్, సబ్ కా వికాసే బీజేపీ లక్ష్యంగా ముందుకు వెళ్తుందన్నారు. బీజేపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. రెండో రోజు ఢిల్లీలో జరిగే బీజేపీ జాతీయ సమావేశాల్లో భాగంగా ప్రధాని మోడీ మాట్లాడారు.   ఇంకా చాలా కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని తెలిపారు మోడీ. నాకు రాజకీయాలు ముఖ్యం కాదు.. ఈ దేశమే ముఖ్యం అన్నారు. పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకు కార్యకర్తలు తీవ్రంగా కష్టపడుతున్నారని తెలిపారు.

పార్టీ శ్రేణులు ఐక్యంగా పని చేయాలి. పార్టీ శ్రేణులు ప్రతీ ఇంటికి, ప్రతీ ఓటరూ వద్దకు వెళ్లి బీజేపీ గురించి వివరించారు. 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరినీ కలిసి బీజేపీ, కేంద్ర ప్రభుత్వం గురించి వివరించాలని సూచించారు ప్రధాని మోడీ. ఈ పదేళ్లు అవినీతి రహిత పాలనను అందించాం. ప్రభుత్వాలు మారుతుంటాయి.. కానీ వ్యవస్థలు అలాగే ఉంటాయి. పదేళ్లలో దేశం యొక్క రూపురేఖలు మారిపోయాయి. బీజేపీ కార్యకర్తలు దేశాభి వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అత్యధిక సీట్లను గెలుస్తుందని.. 400 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు ప్రధాని. 

Read more RELATED
Recommended to you

Latest news