ఇంకొల్లు సభలో చంద్రబాబు నన్ను కించపరిచేలా మాట్లాడారు : ఎమ్మెల్యే కరణం బలరాం

-

చంద్రబాబుపై చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం ఆసక్తికర  కామెంట్స్ చేశారు. తాజాగా విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్యే బలరాం మాట్లాడారు. ముఖ్యంగా ఇంకొల్లు సభలో చంద్రబాబు నన్ను కించపరిచేలా మాట్లాడారని పేర్కొన్నారు. అసభ్య పదజాలంతో చంద్రబాబు మాట్లాడటం.. కొందరు ఆయనకు స్లిప్పులు అందించటం అందరూ చూశారు. చంద్రబాబు కాస్త శృతి మించి దుర్మార్గపు ఆలోచనతో మాట్లాడారు.

ఆయనకంటే దుర్మార్గుడ్ని నేను చూడలేదు అన్నారు. నా రాజకీయ జీవితంలో ఎవరిని హేళనగా మాట్లాడలేదని తెలిపారు. తుచ్ఛమైన, నీచపు బుద్దులు నాకు లేవు అన్నారు. నీ చరిత్ర ఏంటో.. నా చరిత్ర ఏంటో మాట్లాడటానికి నేను ఎక్కడైనా డిబేట్ కి రెడీ..మీ ఆఫీస్ కి రమ్మన్నా వస్తా చంద్రబాబు..1975 నుంచి నా రాజకీయాలు ఏంటో ఆయనకు తెలుసు అన్నారు. 2019లో నేను టీడీపీ ఎమ్మెల్యే సీటు నేను చంద్రబాబును అడగలేదు. చంద్రబాబును, ఆయన కొడుకు లోకేష్ ఎవరో తిట్టారని.. వాళ్ళ మీద కోపంతో నన్ను అక్కడకు పంపారు.. స్థానిక పరిస్థితుల నేపథ్యంలో పార్టీలకు అతీతంగా నన్ను గెలిపించారని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news