బండి సంజయ్ స్టేట్ చీఫ్ గా తప్పించడానికి కారణం ఇదే.. జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు..!

-

తెలంగాణ బీజేపీ చీఫ్ గా బండి సంజయ్ ని తొలగించడం పై కాంగ్రెస్ సీనియర్ నేత,  సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తాజాగా మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం బీజేపీకి ఇష్టం లేదన్నారు. బీజేపీ విమర్శలను కాంగ్రెస్ సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరమే లేదన్నారు. దీపాదాస్ మున్షీ, మాణిక్కం ఠాగూర్, మాణిక్ రావు ఠాక్రెలను విమర్శించే స్థాయి బీజేపీ నాయకులకు లేదు అన్నారు.

అసెంబ్లీ ఎన్నికల ఓటమితో బీజేపీ నాయకుల మైండ్ బ్లాంక్ అయిందన్నారు. ఉద్యోగాల గురించి కాంగ్రెస్ ను ప్రశ్నిస్తున్న కిషన్ రెడ్డి ఏడాదికి బీజేపీ దేశవ్యాప్తంగా ఎన్ని ఉద్యోగాలు ఇస్తుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీకి నిద్ర పట్టడం లేదన్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోడీ హామీ ఇచ్చారని.. ఆ హామీ ఏమైందన్నారు. బండి సంజయ్ ని అధ్యక్ష పదవీ నుంచి ఎందుకు తొలగించారో చెప్పాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ కి నష్టం రాకూడదనే బీజేపీ బండి సంజయ్ ని తొలగించారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news