టీడీపీలో చేరనున్న నరసరావు పేట ఎంపీ

-

పల్నాడు లో కీలక నేత, నరసరావు పేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మార్చి 2వ తేదీన టీడీపీ లో చేరుతున్నట్లు ప్రకటించారు. గురజాలలో జరిగే ‘రా కదలి రా’ సభలో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో చేరుతున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా నరసరావుపేటలో మీడియాతో ఆయన మాట్లాడుతూ…. ప్రజా సంక్షేమం, పల్నాడు అభివృద్ధికే తన ప్రతి అడుగు ఉంటుందని అన్నారు.

 

గురజాల వేదికగా జరగబోయే ‘రా కదలి రా ‘ సభకి కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమాన్ని, పల్నాడు అభివృద్ధికి కట్టుబడి మరలా నరసరావుపేట ఎంపీగా పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు.ఈ 5 సంవత్సరాలలో సాధించుకున్న వాటిని పూర్తి చేయడమే కాకుండా రానున్న కాలంలో మరిన్ని పల్నాడులో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని, వాటికి కట్టుబడి సదా తోడుగా ఉండేలా ఆశీర్వదించాలని శ్రీ కృష్ణ దేవరాయలు పల్నాడు ప్రజనీకానికి విజ్ఞప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news