ట్రెండింగ్ లో కేసీఆర్ లేటెస్ట్ ఫొటోలు

-

బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ చాలా గ్యాప్ తర్వాత  హైదరాబాద్  బంజారాహిల్స్లోని తెలంగాణ భవన్కు వచ్చారు. కరీంనగర్, పెద్దపల్లి లోక్ సభ నియోజకవర్గాలకు చెందిన నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ నేతలతో చాలా సరదాగా, నవ్వుతూ మాట్లాడినట్లు తెలుస్తోంది. గులాబీ బాస్ నవ్వుతున్న ఫొటోలను ఆ పార్టీ నేతలు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఈ ఫొటోల్లో కేసీఆర్, కేటీఆర్, రసమయి బాలకిషన్ నవ్వుతూ కనిపించారు.

ఇదిలా ఉంటే….పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎంపీ అభ్యర్థులను బీఆర్ఎస్ ఖరారు చేసినట్లు సమాచారం. పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్,కరీంనగర్ నుంచి వినోద్ కుమార్ ను బరిలోకి దించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. దీనిపై పార్టీ చీఫ్ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నాయి.రేపు అభ్యర్థుల జాబితాను అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలిపాయి.

Read more RELATED
Recommended to you

Latest news