‘హనుమాన్‌’ అప్‌డేట్‌.. ఓటీటీ కన్నా ముందే టీవీలోకి

-

ఈ ఏడాది సూపర్ హిట్ అయి రికార్డులు బద్ధలు కొట్టిన తొలి చిత్రంగా నిలిచింది హనుమాన్. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. కేవలం తెలుగులోనే కాకుండా హిందీలోనూ ఈ మూవీ భారీ వసూళ్లు రాబట్టింది. ఇక ప్రేక్షకులే కాకుండా విమర్శకుల ప్రశంసలూ అందుకుంది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా  ఎదురుచూస్తున్నారు.

కానీ, ఈ సినిమా ఓటీటీ కన్నా ముందు టీవీలో ప్రసారం కానుంది. మార్చి 16వ తేదీన రాత్రి 8 గంటలకు కలర్స్‌ సినీప్లెక్స్‌ ఛానల్‌, జియో సినిమాలో కేవలం హిందీలో టెలికాస్ట్‌ అవుతుంది. ఈ వివరాలను కలర్స్‌ సినీప్లెక్స్‌ సంస్థ తమ సోషల్‌ మీడియా ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ పెట్టింది.

మార్చి 2 నుంచి ‘జీ 5’లో ‘హనుమాన్‌’ స్ట్రీమింగ్‌ అవుతుందంటూ కొన్ని రోజులు ప్రచారం జరిగింది. తర్వాత, మార్చి 8న విడుదలవుతుందని టాక్‌ వినిపించినా అదీ జరగలేదు. దీంతో, కొందరు అభిమానులు సోషల్‌ మీడియాలో ‘జీ5’ (Zee 5) సంస్థ ఖాతాను ట్యాగ్‌ చేస్తూ ఈ సినిమా ఎప్పుడొస్తుందని కోరారు. దానిపై స్పందించిన సదరు సంస్థ విడుదల తేదీపై నిర్ణయం తీసుకోలేదని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news