లోక్సభ ఎన్నికల ముంగిట హర్యానా రాజకీయాల్లో కీలక మలుపులు చోటుచేసుకున్నాయి. తాజాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను గవర్నర్కు సమర్పించారు. అంతే కాకుండా కేబినెట్ మంత్రులంతా కూడా రాజీనామా చేశారు. బీజేపీ-జననాయక్ జనతా పార్టీ- జేజేపీ ప్రభుత్వంలో చీలికలు ఏర్పడ్డాయి. దీంతో ఆ రాష్ట్ర కేబినెట్ రాజీనామా చేసినట్లు తెలిసింది. ఇక త్వరలోనే ఆ రాష్ట్రానికి నూతన ముఖ్యమంత్రి వచ్చే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి అర్జున్ ముండా, బీజేపీ సీనియర్ నేత తరుణ్ చుగ్ హుటాహుటిన హర్యానా వెళ్లారు. బీజేపీ-జేజేపీ చీలిపోయినా ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు ఉండదని భావిస్తున్నారు. స్వతంత్ర ఎమ్మెల్యేలు మనోహర్ లాల్ ఖట్టర్ సర్కార్కు మద్దతు ఇస్తున్నారు. 90 స్థానాలు ఉన్న హరియాణా అసెంబ్లీలో బీజేపీకి 41 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. ఐదుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు, హర్యానా లోక్హిత్ పార్టీ-HLPకి చెందిన ఒకఎమ్మెల్యే కూడా బీజేపీకి మద్దతిస్తున్నారు. దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జననాయక్ జనతా పార్టీ-JJPకి 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.