డీఎస్సీ పరీక్ష తేదీలు ప్రకటించిన విద్యాశాఖ

-

విద్యాశాఖ డీఎస్సీ పరీక్ష తేదీలను ప్రకటించింది. జులై 17 నుంచి 31 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది.ఇక టెట్ నిర్వహణ నేపథ్యంలో డీఎస్సీ దరఖాస్తు గడువును పొడిగించింది. జూన్ 6 వరకు అప్లికేషన్ చేసుకోవచ్చని తెలిపింది.11,062 టీచర్ పోస్టులతో ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. 5089 పోస్టుల భర్తీకి గతేడాది సెప్టెంబర్లో ఇచ్చిన నోటిఫికేషనన్ను రేవంత్ ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే.

కాగా, డీఎస్సీ-2024 కంటే ముందుగానే టెట్ నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం విద్యా శాఖ కమిషనర్‌కు గురువారం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 3 లక్షల మంది అభ్యర్థులకు డీఎస్సీ రాసే వీలు కలగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news