కాంగ్రెస్ నాయకులకు నామినేటెడ్ పదవుల పండగ

-

కాంగ్రెస్ నాయకులకు నామినేటెడ్ పదవుల పండగ మొదలైంది. 37 కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం చేసింది కాంగ్రెస్‌ సర్కార్‌. ఈ నెల 14వ తేదీనే ఉత్తర్వులు వెలువడినట్లు సమాచారం అందుతోంది. పటేల్ రమేష్​ రెడ్డికి తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్, నిర్మలా గౌడ్ (జగ్గారెడ్డి సతీమణి)కి తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఉచ్చారట.

కాల్వ సుజాతకు తెలంగాణ వైష్య కార్పొరేషన్, జగదీశ్వరరావు (కొల్లాపూర్)కు తెలంగాణ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇచ్చినట్లు సమాచారం. ఈరవత్రి అనిల్ కు తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇచ్చారట. గుర్నాథ్ రెడ్డి (కొడంగల్)కు తెలంగాణ పోలీస్ హౌసింగ్ తెలంగాణ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇచ్చారట. ఇనుగాల వెంకట్రామి రెడ్డికి కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, ఎంఏ ఫహీం కు తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ ఇచ్చినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news