ఎవరు ఊహించనంతగా రేవంత్ రెడ్డి పని చేస్తున్నారు – గోనె ప్రకాష్‌

-

ఎవరు ఊహించనంతగా రేవంత్ రెడ్డి పని చేస్తున్నారు..కక్ష సాధింపులకు పోకుండా పని చేస్తున్నాడన్నారు గోనె ప్రకాష్. ధరణిలో లొసుగులు ఉన్నాయని రేవంత్ ధరణీ కమిటీ వేశాడు….రైతు సంఘాల పేరుతో బొమ్మరాశిపేటలో కొందరు వందల ఎకరాల భూములు కొన్నారని తెలిపారు. 14వ తేదీన బొమ్మరాశి పేటకు ధరణీ కమిటీ వెళ్లిందని…బొమ్మరాశి పేట రైతుల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారని వివరించారు.

gone prakash comments on cm revanth

ధరణీ కమిటీ దొంగ రైతు సంఘాల నాయకుల దగ్గరకు వెళ్లింది..రైతు సంఘ అధ్యక్షుడు రామయ్య ఈటలకు సన్నిహితుడు.. ఆయన దగ్గరికి కమిటీ వెళ్ళిందని వివరించారు. వాస్తవాలు తెలుసుకోకుండా ధరణీ కమిటీ అవగాహన రాహిత్యంతో మాట్లాడింది..దొంగలు ఇచ్చిన సమాచారంతో ధరణీ సభ్యులు మాట్లాడకండని కోరారు. బొమ్మరాశి పేటలో సంతోష్, మల్లారెడ్డి, కవిత, పోచారంతో పాటు మరికొందరి భూములు ఉన్నాయని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news