తొలిసారి ఒకే వేదిక మీదకు చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి, పురంధేశ్వరి !

-

తొలిసారి ఒకే వేదిక మీదకు చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి, పురంధేశ్వరి వచ్చారు. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా రానున్న ఎన్నికల్లో పోటీ చేయనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సీట్ల విషయం కొలిక్కి రాగా తాజాగా ప్రచారంపై ఈ పార్టీలు దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఇవాళ పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం బొప్పూడి వద్ద తొలి భారీ బహిరంగ సభకు రంగం సిద్ధం చేశాయి. ఈ సభకు ప్రధాని మోదీ హాజరు కానున్నారు.

chandrababu

లోక్సభ ఎన్నికల శంఖారావాన్ని ఈ సభా వేదికగా పూరించనున్నారు. పొత్తు ఖాయమయ్యాక జరుగుతున్న తొలి ఎన్నికల సభను అత్యంత భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ తరుణంలోనే తొలిసారి ఒకే వేదికపై చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి, పురంధేశ్వరి మెరిసారు. కిరణ్ కుమార్ రెడ్డి తండ్రి హయాం నుంచి చంద్రబాబుతో కిరణ్ కుమార్ రెడ్డి కి విభేదాలు ఉన్నాయి. 2004 నుంచి రాజకీయాల్లో చంద్రబాబు ప్రత్యర్థిగా ఉంటున్నారు పురంధేశ్వరి. పొత్తు నేపథ్యంలో ఒకే వేదిక మీద కు ముగ్గురు నేతలు వచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news