స్టార్ హీరోయిన్ కి టికెట్ ఇచ్చిన బీజేపీ

-

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తాజాగా బీజేపీ 5వ జాబితాను విడుదల చేసింది. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో బీజేపీ మరోసారి అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ప్రచారంలో దూసుకెళ్తోంది 400 సీట్లు గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది. తాజాగా 111 మందితో 5వ జాబితా విడుదల చేశారు.  తాజాగా బీజేపీ విడుదల చేసిన లిస్ట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కి చెందిన అభ్యర్థులు కూడా ఉన్నారు. తెలంగాణలో ఖమ్మం, వరంగల్ తో పాటు ఏపీలో 6గురు అభ్యర్థులు ఉన్నారు.

రాజమండ్రి -పురంధేశ్వరి, అనకాపల్లి-సీఎం రమేష్, అరకు-కొత్తపల్లి గీత, రాజంపేట-కిరణ్ కుమార్ రెడ్డి, తిరుపతి-వరప్రసాద్, నరసాపురం- శ్రీనివాస్ శర్మ.. ఖమ్మం పార్లమెంట్ నుంచి తాండ్ర వినోద్ రావు, వరంగల్ నుంచి ఆరూరి రమేష్ పోటీ చేయనున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ బీజేపీ నుంచి పోటీ చేయనున్నారు. హిమాచల్ ప్రదేశ్ నుంచి మండి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆమెను బరిలోకి దించనున్నట్టు బీజేపీ ప్రకటించింది. ఇటీవలే ఆమెకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ఇవ్వడంతో.. ఆమె బీజేపీ తరపున పోటీ చేస్తారనే వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. రామాయణ సీరియల్ నటుడు అరుణ్ గోవిల్ యూపీలోని మీరట్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news