కేజ్రీవాల్‌ సతీమణిపై కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

-

లిక్కర్ స్కాం కేసులో ఆప్‌ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఆ పార్టీలో కీలక నేతలు కూడా జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్‌ సతీమణి సునీత కేజ్రీవాల్‌ అ‍న్నీ తానై నడిపిస్తున్నారు.జైలు నుంచి కేజ్రీవాల్‌ పంపిన సందేశాన్ని ఆమె ప్రజలకు చదివి వినిపించారు. ఈ క్రమంలో ఆమె ఢిల్లీ ముఖ్యమంత్రి అవుతారని మీడియాలో కథనాలు వస్తున్నాయి.జైలు నుంచి కేజ్రీవాల్‌ ఆదేశాలు జారీ చేయడంపై బీజేపీ ఆ పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తుంది. ఈ క్రమంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచే పాలన కొనసాగిస్తారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన ప్రకటన ఢిల్లీ ప్రజలకు, చట్టానికి, ప్రజాస్వామ్యానికి అవమానకరమని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మండిపడ్డారు .’అప్పుడు బిహార్‌లో లాలూ ప్రసాద్‌ యాదవ్‌ జైలుకి వెళ్లినప్పుడు ఆయన సతీమణి రబ్రీదేవిని ముందు పెట్టి నడిపించారు. ఇప్పుడు రబ్రీ 2.0 సమయం వచ్చింది’ అని ఎద్దేవ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news