IPL 2024: ఇవాళ గుజరాత్‌ వర్సెస్‌ పంజాబ్‌ ఫైట్‌…గెలిచేదెవరు ?

-

Gujarat Titans vs Punjab Kings, 17th Match: ఐపీఎల్ 2024 టోర్నమెంట్ లో ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నమెంట్లో 17వ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతుంది. ఇక ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో నిర్వహిస్తున్నారు.

Gujarat Titans vs Punjab Kings, 17th Match

ఎప్పటిలాగే ఏడున్నర గంటల ప్రాంతంలో పంజాబ్ టీమ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ జరుగుతుంది. అయితే ఇప్పటివరకు అన్ని మ్యాచ్ల్లో గెలిచిన గుజరాత్ జట్టు టేబుల్ టాపర్గా కూడా ఉంది. అటు పంజాబ్ కింగ్స్ వరుస ఓటములతో సతమతమవుతోంది. ఇలాంటి నేపథ్యంలో గుజరాత్ లాంటి బలమైన జట్టును పంజాబ్ కింగ్స్ ఎలా ఎదుర్కొంటుందో ఇవాళ చూడాలి. ఇక గుజరాత్ జట్టులో కెప్టెన్ శుభమన్ గిల్ నుంచి రషీద్ ఖాన్ వరకు అందరూ తోపు ప్లేయర్లే ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news