IPL 2024 : సెంచరీతో చెలరేగిన రన్ మెషీన్ విరాట్ కోహ్లీ

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్లో భాగంగా ఈరోజు రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య 19వ మ్యాచ్ జరుగుతుంది. జైపూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్స్ విరాట్ కోహ్లి 67 బంతుల్లో సెంచరీ చేశాడు.

ఇందులో 4 సిక్సులు, 9 ఫోర్లు ఉన్నాయి. ఐపీఎల్లో కోహ్లికి ఇది ఎనిమిదో సెంచరీ కావడం విశేషం.ఇక ఈ ఏడాది ఐపీఎల్లో ఇదే తొలి సెంచరీ. అంతే కాకుండా ఈ క్రమంలో కింగ్ కోహ్లి ఐపీఎల్లో సరికొత్త చరిత్ర సృష్టించారు. టోర్నీలో 7,500 పరుగులు చేసిన తొలి బ్యాటర్ గా రికార్డ్ సృష్టించారు. ఆ తర్వాతి స్థానాల్లో భారత మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ (6,755), ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ (6,545), హిట్ మ్యాన్ రోహిత్ శర్మ(6,280), సురేష్ రైనా (5,528) ఉన్నారు .

Read more RELATED
Recommended to you

Latest news