కేసీఆర్.. నీకు చెర్లపల్లి జైలులో డబుల్ బెడ్ రూం ఇల్లు కట్టిస్తా: సీఎం రేవంత్ రెడ్డి

-

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.కేసిఆర్కు చెర్లపల్లి జైలులో చిప్పకూడు తినిపిస్తానని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. శనివారం హైదరాబాద్ శివారులోని తుక్కుగూడలో కాంగ్రెస్ జనజాతర పేరుతో భారీ బహిరంగ సభ తలపెట్టింది. ఇక ఈ జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…’నువ్వు పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టివ్వలేదు. నేను మాత్రం నీకు తప్పకుండా చెర్లపల్లి జైలులో డబుల్ బెడ్ రూం ఇల్లు కట్టిస్తా అని అన్నారు. బిడ్డ, కొడుకు, అల్లుడు, నువ్వు.. అందరూ కలిసి ఉండేలా ఇల్లు కట్టిస్తా. ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోను’ అని వార్నింగ్ ఇచ్చారు.

అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను చిత్తశుద్ధితో అమలు చేస్తున్నామని తెలిపారు. ఢిల్లీ నుండి తెలంగాణకు నిధులు రావాలంటే రాష్ట్రంలో 14 మంది ఎంపీలను గెలిపించడని రేవంత్ రెడ్డి కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news