నయవంచనకు చంద్రబాబు మారు పేరు: పేర్ని నాని

-

చంద్రబాబు నాయుడు పై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ల జీతాన్ని రూ. 10వేలు చేస్తామని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ హామీపై వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని మండిపడ్డారు. ‘చంద్రబాబు వాగ్దానాలను ఎవరూ నమ్మరు.

నయవంచనకు బాబు మారు పేరు అని అన్నారు. అసలు వాలంటీర్ల వ్యవస్థే అనవసరమన్న ఆయన ఇప్పుడు వారిపై ప్రేమను ఒలకబోస్తున్నారు అని విమర్శించారు.వాలంటీర్ల సేవలు ఆగిపోయేలా చేసింది ఎవరో ప్రజలకు తెలుసు’ అని నాని వ్యాఖ్యానించారు.సేవా దృక్పథంతోనే విద్యావంతులు వాలంటీర్లుగా పని చేస్తున్నారు.. చంద్రబాబు అబద్ధపు వాగ్దానాలు.. నమ్మే రోజులు ఎప్పుడో పోయాయని అన్నారు. ప్రభుత్వ సేవలను నేరుగా పేద, మధ్య తరగతి వర్గాలకు వాలంటీర్ల ద్వారా అందించడంతో.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వంపై ప్రజలందరికీ నమ్మకం ఏర్పడింది అని పేర్నినాని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news