నేటితో ముగియనున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర

-

Cm jagan: మేమంతా సిద్ధం బస్సు యాత్ర నేటితో ముగియనుంది. జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్ యాత్ర మార్చ్ 27 న ప్రారంభమైన సంగతి తెలిసిందే.ఇప్పటికీ 21 రోజులు పాటు బస్ యాత్ర సాగింది. ఈ రోజు 22వ రోజు బస్ యాత్ర శ్రీకాకుళం జిల్లా టెక్కలి బహిరంగ సభతో మేమంతా సిద్ధం బస్ యాత్ర ముగుస్తుంది. మొత్తం 22జిల్లాలో బస్ యాత్ర జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు 15 బహిరంగ సభల్లో మాట్లాడారు.

We are all ready for the bus trip that will end today

ఈ రోజు శ్రీకాకుళం జిల్లా టెక్కలి లో 16 బహిరంగ సభలో ముఖ్యంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రసంగించనున్నారు. నేడు శ్రీకాకుళం జిల్లా లో సిఏం జగన్ మేమంతా సిద్దం బస్సు యాత్ర ఉంది. ఎచ్చెర్ల నియోజకవర్గం అక్కి వలస నుండి ప్రారంభం కానున్న బస్సు యాత్ర…చిలకపాలేం జంక్షన్ ఎచ్చెర్ల బైపాస్ , శ్రీకాకుళం టౌన్ బైపాస్, నరసన్నపేట బైపాస్ కోటబొమ్మాళి మీదుగా టెక్కలి నియోజకవర్గం వరకు సాగనుంది. బోజన విరామం తరువాత 3 గంటలకు టెక్కలి నియోజకవర్గం అక్కవరం లో భారీ బహిరంగ సభ ఉంటుంది. టెక్కలి లో మేమంతా సిద్దం బస్సు యాత్ర ముగియనుంది. అనంతర హెలికాప్టర్ లో విశాఖ కు అక్కడి నుండి విజయవాడకు వెళతారు.

Read more RELATED
Recommended to you

Latest news