డీసీఎం బోల్తా పడి గాయాలైన బాధితులను పరామర్శించిన బాజిరెడ్డి గోవర్ధన్..!

-

నిజామాబాద్ జిల్లా వర్ని మండలం బడా పహాడ్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ప్రముఖ దర్గా లో ఒకటైన బడా పహాడ్ ని దర్శించుకోవడానికి వస్తున్న భక్తులు ఉన్న డీసీఎం బోల్తా పడింది. దీంతో డీసీఎం లో ఉన్న భక్తులు గాయాలు పాలయ్యారు. ఇదివరకు కూడా ఇటువంటివి చోటు చేసుకున్నాయి. అయితే తాజాగా జరిగిన ఈ సంఘటన లో పలువురు గాయాలు పాలయ్యారు.

బడా పహాడ్ దర్గాకి వెళ్తుండగా డీసీఎం బోల్తా కొట్టడంతో గాయాలైన బాధితుల్ని చికిత్స కోసం అని ఆసుపత్రికి తరలించారు. డీసీఎం బోల్తా పడి గాయాలైన బాధితులను పరామర్శించారు బీఆర్ఎస్ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. వాళ్లకు మెరుగైన చికిత్స అందేలా చూడమని ఆస్పత్రి సిబ్బందిని బీఆర్ఎస్ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news