వయనాడ్ లో ఓటమి భయం.. అందుకే రాయ్బరేలీలో యువరాజు పోటీ : ప్రధాని మోదీ

-

రాహుల్ గాంధీని ఉద్దేశించి ప్రధాని మోదీ మరోసారి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ యువరాజు వయనాడ్లో ఓడిపోతాననే భయంతో రాయ్ బరేలీ నుంచి బరిలోకి దిగుతున్నారని విమర్శించారు. అమేఠీ నుంచి పోటీ చేయడానికి భయపడి రాయ్ బరేలీ నియోజకవర్గానికి రాహుల్ పారిపోయారని ఎద్దేవా చేశారు. బంగాల్లోని బర్ధమాన్-దుర్గాపుర్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ.. కాంగ్రెస్, టీఎంసీ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశారు.

సోనియా గాంధీని ఉద్దేశించి కాంగ్రెస్ నాయకురాలు ప్రత్యక్ష ఎన్నికల్లో పోరాడే ధైర్యం చేయరని తాను ఎప్పుడో పార్లమెంటులో చెప్పానని మోదీ అన్నారు. ఆమె ప్రత్యక్ష ఎన్నికల నుంచి పారిపోయి రాజస్థాన్‌ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారని విమర్శించారు. వయనాడ్లో రాహుల్ ఓడిపోతారని ముందే చెప్పానని.. అందుకే యువరాజు రాయ్బరేలీలో పోటీ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అమేఠీలో పోటీకి కూడా రాహుల్ భయపడ్డారని ఎద్దేవా చేశారు.

“మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తామని లిఖితపూర్వక హామీ ఇవ్వమని నేను కాంగ్రెస్కు సవాల్ చేశాను. కానీ వారు మౌనంగా ఉన్నారు. నాకు వ్యతిరేకంగా ఇచ్చిన ‘ఓట్ జిహాద్’ పిలుపుపై కాంగ్రెస్, టీఎంసీ మౌనంగా ఉన్నాయి. ఎందుకంటే వారు జిహాద్కు మద్దతిస్తున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అతితక్కువ సీట్లు గెలుచుకుంటుంది. కాంగ్రెస్ చరిత్రలో ఈ ఎన్నికల్లో గెలిచేవే అతి తక్కువ సీట్లు.” అని ప్రధాని మోదీ విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news