వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తే.. రేవంత్ కి పుట్టగతులుండవు : ఈటల రాజేందర్

-

వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తే.. సీఎం రేవంత్ రెడ్డికి పుట్టగతులుండవని మల్కాజ్ గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఇవాళ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను మల్కాజిగిరి ప్రజలను తక్కువ చేసి మాట్లాడానని.. సోషల్ మీడియాలో ఓ  వీడియో చక్కర్లు కొడుతుంది. ఇన్నేళ్లుగా తనను చూస్తున్న ప్రజలు ఎవరు నమ్మరు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ తో ఇలా చేస్తున్నారు.. నాయకులు ప్రజలు ఈ నాలుగు రోజులు ఇలాంటి దొంగలు, చిల్లరగాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండండని సూచించారు.

కేసీఆర్ విఫలమవడానికి పదేళ్ల సమయం పట్టింది. కానీ రేవంత్ రెడ్డి నాలుగు నెలలు గడవక ముందే ప్రజల నమ్మకాన్ని కోల్పోయారని తెలిపారు. మానవ బాంబు అయి పేలతా..  పేగులు మెడలో వేసుకుంటా అని ఒక ముఖ్యమంత్రి మాట్లాడవచ్చా..? ఉన్మాదులు, సైకోలు అలా మాట్లాడతారు. ‘సీఎం రేవంత్ రెడ్డి ఫస్ట్ నీ భాష మార్చుకో.. సీఎం స్థాయిని, నీ స్థాయిని తగ్గించుకోకు. నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసి కేసీఆర్ మూల్యం చెల్లించుకున్నారు. వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తే రేవంత్ కి కూడా పుట్టగతులుండవు. పాలించే జాతి మాదే, పాలించే కెపాసిటీ మాకే ఉంది’ అని అహంకారంతో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. అంత జాత్యహంకారం, కుల రాజకీయం పనికి రాదు.

సీఎం అయ్యాక ఆయన భాష మార్చుకోవాలని రేవంత్ కి హితవు పలికారు. ముఖ్యంగా  చిల్లర మాటలు మానుకోవాలి. రేవంత్ మాటలకు విశ్వసనీయత లేదు.
కమిటీల పేరుతో కాళేశ్వరం కాలయాపన చేశారు. ఫోన్ ట్యాపింగ్ లు కొనసాగుతున్నాయి. కేసీఆర్ జుట్లో కెళ్ళి వెళతా అంటే ఏంటో అనుకున్నా.. అబద్ధాలు చెప్పడంలో, మార్ఫింగ్, మోసం చేయడంలో కేసీఆర్ ను మించిపోయారు. రేవంత్ అబద్దాల కోరు. బిల్లులు చెల్లించాలంటే 10 శాతం కమీషన్ చెల్లించాలట.. ఈ డబ్బులు తీసుకెళ్ళి రాహుల్ కి ఇస్తున్నారు. రెడ్డిలం రెడ్డికి ఓటు వేసుకుందాం అని రేవంత్ చెప్పడం దిగజారుడుకి పరాకాష్ట అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్  అభ్యర్థులు ఇద్దరినీ ప్రజలు గుర్తుపట్టడం లేదు. ఇద్దరు నాకు పోటీ కాదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news