మేం వచ్చాక తిన్నదంతా వసూలు చేస్తాం :చంద్రబాబు

-

వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని.. కూటమిదే అధికారమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎన్నికల ప్రచారంలో చివరి రోజు చిత్తూరులో నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..నేను పుట్టిన జిల్లా. రాజకీయ జన్మనిచ్చి.. ఓనమాలు నేర్పిన జిల్లా ఇది. అందుకే ఎన్నికల ప్రచారంలో చివరి సభ ఇక్కడ పెట్టుకున్నా అని తెలిపారు.

45 సంవత్సరాలుగా నన్ను ఆదరించారు.. ముందుకు నడిపించారు. ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేశా. తెలుగుదేశం పార్టీ బీజేపి, జనసేన, సామాజిక న్యాయం పాటించాయి. రాజన్‌కు సముచిత స్థానం ఇచ్చే బాధ్యత నాది” అని చంద్రబాబు హామీ ఇచ్చారు. తిరుపతిలో ఐఐటీ, ఐసర్‌ లాంటి విద్యా సంస్థలు ఏర్పాటు చేశాం. హైవేల విస్తరణకు కృషి చేసిన పార్టీ మాది. 49 సీట్లు ఇచ్చిన రాయలసీమ ప్రజలను జగన్‌ మోసం చేశారు అని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news