మా పరిపాలనలో మంచి జరిగి ఉంటే ఓటేయండి – సీఎం జగన్

-

మా పరిపాలనలో మంచి జరిగి ఉంటే ఓటేయండి అని కోరారు సీఎం జగన్. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పలువురు ప్రముఖులు కూడా ఉదయాన్నే వచ్చి ఓటు వేస్తున్నారు.

CM YS Jagan who voted

ఈ క్రమంలోనే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన సతీమణి భారతితో కలిసి వచ్చి ఓటేశారు. పులివెందులలోని భాకరాపురం పోలింగ్‌ కేంద్రంలో సీఎం దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ… గత ఐదు సంవత్సరాలుగా పరిపాలన చూశారు… 5 సంవత్సరాలుగా మంచి పరిపాలన అందించామన్నారు. మా పరిపాలనలో మంచి జరిగిఉంటే ఓటేయండి అని సీఎం జగన్ మోహన్ రెడ్డి కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news