3 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుస్తా : డీకే అరుణ

-

నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ మీడియా సమావేశం లో మాట్లాడుతూ.. తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 12 నుండి 15 స్థానాల్లో గెలుస్తుందని ఆశా భావం వ్యక్తం చేశారు.మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికల్లో 3 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందుతానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ వారు ఓటర్లకు డబ్బులు చూపి ప్రలోభాలకు గురి చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నా.. ప్రజలు అసంతృప్తిలో ఉన్నారని తెలిపారు.

ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులను చెప్పకుండా.. ఒక మహిళ అని కూడా చూడకుండా తనను కించ పరిచారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ నాయకులు అనేక రకాలుగా తనపై దూషణలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వంకి 6 నెలల పాలనలో ప్రజల నుండి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఏర్పడిందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news