లఖ్‌నవూపై దిల్లీ క్యాపిటల్స్‌ విజయం

-

2024 ఐపీఎల్లో భాగంగా తాజాగా జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్పై దిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. తన ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో 19 పరుగుల తేడాతో గెలిచింది. ఏడో విజయాన్ని అందుకున్న పంత్ సేన, సాంకేతికంగా ప్లేఆఫ్స్‌ రేసులో ఉన్నప్పటికీ పేలవ రన్‌రేట్ కారణంగా ముందడగు వేయడం కష్టమే. క ఏడో ఓటమిని అందుకున్న లక్నోది ఇదే పరిస్థితీ. మరో మ్యాచ్‌ ఆడాల్సి ఉన్న ఆ జట్టు, అందులో గెలిచినా ఎటువంటి ఉపయోగం దాదాపుగా ఉండకపోవచ్చు.

అభిషేక్‌ పోరెల్‌ (58; 33 బంతుల్లో 5×4, 4×6), స్టబ్స్‌ (57 నాటౌట్‌; 25 బంతుల్లో 3×4, 4×6) చెలరేగడంతో మంగళవారం మొదట దిల్లీ 4 వికెట్లకు 208 పరుగులు చేసింది. రవి బిష్ణోయ్‌ (1/26) కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశాడు. ఛేదనలో లఖ్‌నవూ 9 వికెట్లకు 189 పరుగులే చేయగలిగింది. ఇషాంత్‌ (3/34) ఆ జట్టును దెబ్బతీశాడు. పూరన్‌ (61; 27 బంతుల్లో 6×4, 4×6), అర్షద్‌ ఖాన్‌ (58 నాటౌట్‌; 33 బంతుల్లో 3×4, 5×6) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడినా ఫలితం లేకపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news