భర్తపై దాడి జరిగిన నేపథ్యంలో..అతని భార్య ప్రతీకారం తీర్చుకుంది. ఈ సంఘటన మధురా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మద్యం కొనేందుకు వెళ్తే…ఓ వ్యక్తి తల పగల గొట్టింది వైన్ షాపు సిబ్బంది.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2024/05/Break-into-wine-shop-and-attack-staff.jpg)
అయితే.. తన భర్తను రక్తంతో చూడడంతో రెచ్చి పోయింది బాధితుడి భార్య. అనంతరం వైన్ షాపులోకి చొరబడి సిబ్బందిపై దాడి చేసింది. అడ్డుకునేందుకు వచ్చిన పోలీసులను జుట్టు పట్టుకుని కొట్టింది ఆ మహిళ. మధురా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. వైన్ షాపు సిబ్బందితో పాటు మహిళ మీద వేర్వేరుగా మూడు కేసులు నమోదు చేసిన పోలీసులు… ఈ సంఘటనను దర్యాప్తు చేస్తున్నారు.